స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో , జిల్లా గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విబిజి రామ్జీ, సెర్ప్ సిబ్బంది పాల్గొన్నారు.
స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో , జిల్లా గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, విబిజి రామ్జీ, సెర్ప్ సిబ్బందితో కలిసి వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ.. చెత్తను వివిధ రకాలుగా వేరు చేయడం, వ్యర్థాలను తగ్గించడం, పునర్వినియోగం మరియు పునరుత్పత్తి విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే విధానాలు, పరిశుభ్రత, పారిశుధ్యం, చెత్త నిర్వహణ పద్ధతులపై సిబ్బందికి అవగాహన కల్పించారు. గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రంగా అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆమె తెలిపారు. పర్యావరణహితమైన, స్థిరమైన జీవన విధానాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆమె సూచించారు. అనంతరం అధికారులు, సిబ్బంది స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












