బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా తెలంగాణలో 20 నుంచి 23వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
బంగాళాఖాతంలో వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో ఇవాళ, రేపు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని, అయితే 20 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షసూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్లోనూ రాబోయే నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలోని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. ఈ క్రమంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.












