నిర్మల్, 2026-06-05
నరమల జలలాలోన 30 పరభుత పాఠశాలలలో ారథుల పరతభను ెలకతీాలనే లకషంతో ఏకల ఫౌండేషన, ాంగ శకత ఫౌండేషన సంుకతంగా ాాహన కారకరమానన నరహసతుననా ఈ కారకరమంలో భాగంగా ఇటీల మంజులాపూర పాఠశాలలో చతరలేఖన పోటీలు నరహంచ, ఉతతమ పరతభ కనబరచన ఆరుగురు ారథులకు బహుమతులు అంజేశారు
నిర్మల్ జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో ఏకలవ్య ఫౌండేషన్, దివ్యాంగ శక్తి ఫౌండేషన్ సంయుక్తంగా విద్యావాహిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గత జులై నెలలో మంజులాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులకు ఇటీవల బహుమతులను అందజేశారు.
మంజులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఫౌండేషన్ వారు నిర్వహించే అన్ని కార్యక్రమాలకు మండల విద్యాధికారి శ్రీమతి పద్మ గారు దాతగా వ్యవహరిస్తారని ఏకలవ్య ఫౌండేషన్ విద్యావాహిని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ చిన్నయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ శక్తి ఫౌండేషన్ ఛైర్మెన్ మహేష్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.












