ఫరూక్ నగర్, రంగారెడ్డి, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
ఫరూక్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన పూర్తి స్థాయి కార్యవర్గ కమిటీని మండల అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ ప్రకటించారు. పార్టీని బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాడటం లక్ష్యంగా ఈ నియామకాలు జరిగాయి.
*ఫరూక్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి కార్యవర్గ కమిటీ ప్రకటన* *మండల పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్* ఫరూక్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన పూర్తి స్థాయి కార్యవర్గ కమిటీని మండల పార్టీ అధ్యక్షుడు కే. శ్రీనివాస్ (రాయికల్ శ్రీనివాస్) అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేందుకు అనుభవజ్ఞులైన, నిబద్ధత కలిగిన నాయకులతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల వద్దకు చేర్చడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఫరూక్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ సభ్యుల వివరాలు ఉపాధ్యక్షులుగా సింగారం సుదర్శన్, కావలి శ్రీశైలం, సద్దుల ఆంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా దేవగిరి నవీన్, బుడ్డ నర్సింహులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రధాన కార్యదర్శులుగా నంద్యాల పుల్లారెడ్డి, జమాల్ పూర్ రాజు, అధికార ప్రతినిధులుగా ఎండి. అజ్మత్ బాబా అలీ, కర్రోల్ల యాదయ్య నియమితులయ్యారు. కోశాధికారులుగా జంగయ్య వడ్ల, భరత్ పోలేమోని, కార్యదర్శులుగా పూజారి లక్ష్మయ్య, ఎండి. మునావర్ (మున్నా), సంజు నాయక్లను నియమించారు. సంయుక్త కార్యదర్శులుగా జి. యాదయ్య గౌడ్, ఎ. అఖిల్, లంకల భరత్ సింహా రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఖాజా లయీక్ అహ్మద్, యాదగిరి దాసరి, వీరమోని రాజులను నియమించారు. నూతనంగా నియమితులైన నాయకులందరికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతన కార్యవర్గ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.. KP |












