మండలంలోని పిప్పల్దారి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి ఆదివాసీ గిరిజనులు పాలాభిషేకం నిర్వహించారు. గిరిజనులకు అమలులో ఉన్న 6 శాతం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి గత ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నేస్తం అనసూయ రామకృష్ణ, మాజీ సర్పంచ్ బండారి శ్రీధర్ రెడ్డి, పటేల్ లక్ష్మణరావు, గంగాధర్, మడవి నగేష్, ఉయికే నగేష్, లక్ష్మణ్, సంతోష్, యశ్వంత్ రావు, జగ్గారావు, రాము, భీమ్రావు, శంభు తదితరులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.












