
మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన శ్రీకృష్ణ స్వామివారి కల్యాణ మహోత్సవానికి రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా వరలక్ష్మి హాజరయ్యారు. వీరిని గ్రామ ప్రజలు, కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు.



















