
ప్రొద్దుటూరులో అనారోగ్యంతో మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచిన అనంతరం, పోలీసుల అభ్యర్థన మేరకు ఫౌండేషన్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.



















