వివిధ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉపసర్పంచుల నాయకులు మీడియా సమావేశం నిర్వహించి, అనంతరం తెలంగాణ పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ ఐఏఎస్, వైస్ చైర్మన్ సుధాకర్ గార్లను కలిసి తమ సమస్యలపై మెమొరాండం సమర్పించారు. ఉపసర్పంచుల చెక్ పవర్, శిలాఫలకాలు, తీర్మానాలపై జీవోల జారీకి కమిషనర్ హామీ ఇచ్చారు.
*ఉప సర్పంచ్లకు వినతులకు సానుకూలంగా స్పందించిన పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్* *మెమరండం ఇచ్చిన ఉపసర్పంచ్ల నాయకులు మల్కయ్యగారి గోవర్ధన్ రెడ్డి, ఎం.ప్రకాష్ గౌడ్,జి అభినవ్, ఎస్.జావిద్* *రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ , ప్రధానకార్యదర్శి మట్ట శ్రీనివాస్ అధ్యక్షతన* హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీమతి దివ్య దైవ రాజన్ ఐఏఎస్ గారిని, మరియు పంచాయతీరాజ్ వైస్ చైర్మన్ సుధాకర్ గారిని కలిసి మెమోరండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ దివ్య దేవ రాజన్ గారు ఉప సర్పంచ్ల ముఖ్య నాయకులతో దాదాపు గంట పాటు చర్చలు కొనసాగించి, ఉప సర్పంచుల సమస్యలపై కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి, ఉప సర్పంచుల చెక్ పవర్ సాధారణ నియమాలతో కొనసాగిస్తామని, శిలాఫలకాలపై ఉప సర్పంచుల పేర్లు ఉండేలా జీవో,మండల సర్వసభ్య సమావేశాలకు ఉప సర్పంచులకు అధికారిక ఆహ్వానం, గ్రామ పంచాయతీ ప్రతి తీర్మానంపై ఉప సర్పంచులు సంతకం చేసే విధంగా జీవో లను, వెంటనే విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలంగాణ పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీమతి దివ్య దేవరాజన్ ఐఏఎస్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ల నాయకులు మాట్లాడుతూ ఈ విజయం కోసం హైదరాబాద్కు తరలివచ్చిన జిల్లాల ఉప సర్పంచులకు, అలాగే మన హక్కుల కోసం పోరాటంలో అరెస్టయిన ప్రతి ఒక్క ఉప సర్పంచ్కు లభిస్తుంది మరియు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తిక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్ట శ్రీనివాస్, షాద్ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు మల్కయ్యగారి గోవర్ధన్ రెడ్డి, ఫరుక్ నగర్ మండల అధ్యక్షులు ముక్కుపోగుల ప్రకాష్ గౌడ్, జిల్లా ఉపసర్పంచ్ల ఫోరం జి .అభినవ్, గుడిసె బాలరాజ్, సయ్యద్ జావిద్, ఎన్ బలరాం, మరియు రాష్ట్ర ,జిల్లాల, మండల ఉప సర్పంచ్ల నాయకులు, ఉపసర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.. KP












